News March 2, 2025

కమలాపూర్: రూ.9,51,000ల సైబర్ మోసం

image

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.9,51,000 పోగొట్టుకున్న ఘటన కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ హరికృష్ణ కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మనోజ్‌కు టెలిగ్రామ్ ద్వారా బావి జోషి అనే అడ్రస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. టాస్క్ ఆడితే డబ్బులు రెట్టింపు అవుతాయని తెలుపగా విడతల వారీగా రూ.9.51లక్షలు వేశారు. ఎంతకూ నగదు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News September 17, 2025

మధ్యాహ్నం రెండు గంటలలోపు రిపోర్ట్ చేయండి: DEO

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులందరూ సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల లోపు గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో తప్పనిసరిగా రిపోర్టు చేయాలని డీఈవో చంద్రకళ సూచించారు. బుధవారం మాట్లాడుతూ.. ఎంపికైన ఉపాధ్యాయులకు అమరావతిలో 19వ తేదీన సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు. రిపోర్టు చేసిన ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

News September 17, 2025

12వేల మెట్రిక్ టన్నుల పొగాకు కొనుగోలు: కలెక్టర్

image

నల్లబర్లీ పొగాకు కొనుగోలులో అంతరాయం లేకుండా అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బుధవారం తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 7,788 మంది రైతుల నుంచి 12వేల మెట్రిక్ టన్నుల పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మరో 1,600 మెట్రిక్ టన్నుల పొగాకును రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

News September 17, 2025

తిరుపతి DSC అభ్యర్థులకు DEO సూచనలు

image

తిరుపతి జిల్లాలో DSCకి ఎంపికైన అభ్యర్థులందరికీ CMచేత అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ మంజూరు చేస్తున్నట్లు DEO KVN కుమార్ బుధవారం తెలిపారు. DSC అభ్యర్థుల కోసం చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు గురువారం ఉదయం 7 గంటలకు ఈ కాలేజీ వద్దకు ఫొటో, ఆధార్, కాల్ లెటర్‌తో హాజరు కావాలన్నారు.