News October 23, 2025
కమ్యూనిటీ హాల్ నిర్వహణ బల్దియాదే: బల్దియా కమిషనర్

నగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ నిర్వహణ బల్దియాదేనని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసిన అన్ని కమ్యూనిటీ హాల్లను వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇకపై బల్దియా అధికారులే నిర్వహణ చేయాలని కమిషనర్ సూచించారు.
Similar News
News October 24, 2025
ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం.. టెస్ట్ సక్సెస్

దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు పూర్తయినట్లు సీఎం రేఖాగుప్తా తెలిపారు. బురారి ప్రాంతంలో ఇవాళ ప్రయోగాత్మక పరీక్ష సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 29న ఢిల్లీలో కృత్రిమ వర్షానికి అవకాశముందన్నారు. ఇది వాయు కాలుష్యంపై పోరులో శాస్త్రీయ పద్ధతిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణతో వాతావరణాన్ని సమతుల్యంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
News October 24, 2025
NRPT: విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు: కలెక్టర్

నారాయణపేట జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించడంపై నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ 14న జిల్లా స్థాయిలో స్పెల్ బీ, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News October 24, 2025
మంథని: NOV 3న అరుణాచలానికి స్పెషల్ బస్

కార్తీక పౌర్ణమి సందర్భంగా NOV 5న అరుణాచలగిరి ప్రదక్షిణకు మంథని డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ నడపనున్నట్లు డిపో మేనేజర్ వి.శ్రవణ్ కుమార్ తెలిపారు. NOV 3 సాయంత్రం మంథని నుంచి బయలుదేరి, KNR, HYD, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాల తర్వాత 4న రాత్రి బస్ అరుణాచలం చేరుతుంది. 5న తిరుగు ప్రయాణం. 6న అలంపూర్ జోగులాంబ దర్శనమనంతరం మంథని చేరుకుంటుంది. టికెట్ పెద్దలకు రూ.5040, పిల్లలకు రూ.3790. 9959225923