News February 7, 2025

కరప: గుండెపోటుతో తాటి చెట్టుపైనే కార్మికుడి మృతి

image

కరప మండల కేంద్రంలో ఒక కల్లుగీత కార్మికుడు తాటిచెట్టుపై గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం సాయంత్రం రామ కంచి నగర్ కాలనీ వద్ద పెంకె శ్రీనివాస్(43)అనే కల్లుగీత కార్మికుడు తాటి చెట్టు పైకి ఎక్కి కల్లు గీస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ సంఘటన గమనించిన స్థానికులు చెట్టు పైకి ఎక్కి కిందకు దింపారు. అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.

Similar News

News February 24, 2026

ఖమ్మం: ‘సౌర’ సిరి రూ.12 కోట్లతో సోలార్ ప్లాంట్లు!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం మహిళల జీవితాల్లో వెలుగులు నింపనుంది. నాలుగు సోలార్ ప్లాంట్లు మంజూరు కాగా, ఒక్కో ప్లాంట్‌ను ఒక మెగావాట్ సామర్థ్యంతో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఎర్రుపాలెం మండలం రాజుపాలెంలో పైలట్ ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును డిస్కంలకు విక్రయించి ఆదాయం పొందనున్నారు.

News February 24, 2026

ఉమ్మడి రంగారెడ్డిలో యూరియా నిల్వలు

image

ఫిబ్రవరి 24 వరకు యూరియా నిల్వల పై ఫెర్టిలైజర్ యాప్ తాజా సమాచారం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,71,041 యూరియా బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా వికారాబాద్‌లో 10,991 బ్యాగులు, రంగారెడ్డిలో 16,809 బ్యాగులు, మేడ్చల్-మల్కాజిగిరిలో 8,263 బ్యాగులు నిల్వలో ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులు అవసరమైన మేరకు బుక్ చేసుకోవాలని సూచించారు.

News February 24, 2026

ఉమ్మడి జిల్లాలో ‘సుపారీ’ సెగ.. పెరుగుతున్న నేర ప్రవృత్తి

image

ఖమ్మం జిల్లాలో నేరాల తీరు మారుతోంది. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాల కోసం ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు కిరాయి ముఠాలను ఆశ్రయించడం ఆందోళన కలిగిస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చేయాలని రూ. లక్షల సుపారీలు ఇస్తున్నా, పోలీసులు సాంకేతికతతో నిందితులను పసిగడుతున్నారు. ఇటీవలి యూట్యూబర్ హత్య ఇందుకు నిదర్శనం. నేరస్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ పోలీసులు కటకటాల పాలు చేస్తున్నారు.