News March 25, 2025

కరీంనగర్‌కు రెండు కొత్త కాలేజీలు

image

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజినీరింగ్, లా కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల కావాలని ఎప్పటినుంచో విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. తాజాగా రెండు కళాశాలలు మంజూరు కావడంతో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.

Similar News

News December 23, 2025

SKLM: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రవిబాబు మంగళవారం తెలిపారు. BSE.AP వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు DEO కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్‌లో ఫీజు రూ.100, డ్రాయింగ్ HG ఫీజు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ LG రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ HG రూ.200లు ఈ నెల 27లోపు చెల్లించాలన్నారు.

News December 23, 2025

రైతు దినోత్సవం: దివంగత ప్రధాని చరణ్ సింగ్ గురించి తెలుసా?

image

* ఉత్తర భారతంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు
* జమీందారీ వ్యవస్థ రద్దు, రైతులకు భూపంపిణీలో కీలక పాత్ర
* ప్రధాని అయిన రెండో ఉప ప్రధాని
* ప్రధాని హోదాలో 23 రోజులు మాత్రమే
* పార్లమెంటును ఫేస్ చేయని ఏకైక ప్రధాని
* కనీస మద్దతు ధరకు పునాదులు వేసిన వ్యక్తి
* మరణానంతరం 2024లో భారతరత్న ప్రదానం
* ఈరోజు (Dec 23) ఆయన జయంతిని ఏటా రైతుల దినోత్సవంగా నిర్వహిస్తారు.

News December 23, 2025

HYD: భర్తలను బతకనివ్వరా?

image

సాఫీగా సాగుతున్న సంసారంలో అక్రమ సంబంధాలు అగ్గి రాజేస్తున్నాయి. ఉద్రేకంలో కొందరు, పరాయి మోజులో మరికొందరు భర్తలను కడతేరుస్తుండటం కలవరపెడుతున్నాయి. బోడుప్పల్‌లో 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు భర్తలు హతమయ్యారు. NOV 27న తాగి గొడవ చేస్తున్నాడని కొడుకు, మేనల్లుడితో కలిసి భర్త ప్రాణం తీసింది. తాజాగా పూర్ణిమ యువకుడి మోజులో భర్తను చున్నీతో చంపింది. దీనికి ముందు గండిపేట, షాద్‌నగర్‌లోనూ భర్తలను కిరాతకంగా చంపారు.