News September 17, 2024
కరీంనగర్లో జాతీయ జెండా ఆవిష్కరించనున్న మంత్రి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో మంత్రి శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులు అర్పించి తర్వాత జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Similar News
News September 16, 2025
కరీంనగర్: ‘చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలి’

మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలని, కరీంనగర్ జిల్లాలోని మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం మత్స్య శాఖ కమిషనర్ ఐఏఎస్ నిఖిలకు కరీంనగర్ జిల్లా మత్స్యకారులు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ మత్స్యశాఖ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని, చేప పిల్లలను సకాలంలో పంపిణీ చేస్తేనే మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు.
News September 16, 2025
కరీంనగర్: కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్గా విద్యాసాగర్

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ SC సెల్ కన్వీనర్గా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కనకం విద్యాసాగర్ నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు. LMDలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విద్యాసాగర్ను అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విద్యాసాగర్ తెలిపారు.
News September 16, 2025
వెలిచాలలో మహిళా డిగ్రీ కళాశాల NSS క్యాంప్

రామడుగు మండలం వెలిచాలలో మహిళా డిగ్రీ కళాశాల NSS క్యాంప్ 6వ రోజుకు చేరింది. మంగళవారం NSS ఆఫీసర్ డా. ఈ.స్రవంతి ఆధ్వర్యంలో NSS వాలంటీర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. స్కూల్ విద్యార్థులలో క్రమశిక్షణ కార్యక్రమాలు, గ్రామంలో సర్వే నిర్వహించారు. అనంతరం KNR సైబర్ క్రైమ్ వారు హాజరై ఆన్లైన్ మోసాలను మహిళల భద్రతను గురించి వివరించారు.