News February 8, 2026
కరీంనగర్లో MIM కీ ‘రోల్’

KNR కార్పొరేషన్లో ఎక్కువ కార్పొరేటర్లను గెలిపించుకునేందుకు MIM పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 15 స్థానాలు సాధించిన MIM.. ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలను గెలిచి BJPకి చెక్ పెట్టాలని చూస్తోంది. ఈసారి మేయర్ ఎంపికలో MIM కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అసదుద్దీన్ ఒవైసీ KNRలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. BRSకు <<19081458>>ఓటు<<>> వేస్తే BJPకే వేసినట్లే అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 8, 2026
కరీంనగర్: జోరుగా మద్యం పంపిణీ.. విందు రాజకీయాలు షురూ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో విందు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. వార్డులలో వాడవాడనా కార్యకర్తల నుంచి మొదలు లీడర్ల వరకు గ్రూపులు విభజించి విందు ఇస్తున్నారు. దీనికి తోడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి మద్యం బాటిల్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల హడావిడి ప్రారంభమైనప్పటి నుంచి ఈ తంతు నడుస్తున్నప్పటికీ పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత జోరు అందుకుంది.
News February 8, 2026
భారత్-అమెరికా డీల్: మన చమురుపై వారి పెత్తనమా?

రష్యా నుంచి చమురు కొనడం ఆపేయని పక్షంలో మళ్లీ 25% టారిఫ్లు విధిస్తామన్న US నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత చమురు కొనుగోలు నిర్ణయాలను అమెరికా శాసించడం ఏంటని కొందరు నిలదీస్తున్నారు. స్వతంత్ర విదేశాంగ విధానం ఉన్న దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. డీల్ సందర్భంగా ట్రంప్ ఏకపక్ష ప్రకటనలు, ఆయన వాడుతున్న అహంకారపూరిత భాషపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
News February 8, 2026
ఇంటర్ ప్రాక్టికల్స్.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

ఏలూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ మంగళవారంతో ముగుస్తాయని RIO యోహాన్ ఆదివారం తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి 56 కేంద్రాల్లో థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఉదయం 8:30 గంటలకే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. శనివారం జరిగిన ప్రాక్టికల్స్కు 4,363 మంది హాజరవ్వగా, 169 మంది గైర్హాజరైనట్లు ఆయన వివరించారు.


