News August 15, 2025

కరీంనగర్: ‘ఉద్యోగుల కృషి దేశ ప్రగతికి పునాది’

image

కరీంనగర్‌లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల కృషి దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేస్తే సమగ్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News

News August 15, 2025

కరీంనగర్ అర్బన్ బ్యాంకులో స్వాతంత్ర్య వేడుకలు

image

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్యాంక్ అధ్యక్షుడు గడ్డం విలాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులను స్మరించుకున్నారు. ప్రజల్లో దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి పట్ల నిబద్ధత పెరగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ముఖ్య నిర్వహణ అధికారి శ్రీనివాస్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

News August 15, 2025

KNR: ఈనెల 22న జిల్లాస్థాయి సీనియర్స్ యోగా పోటీలు

image

ఈనెల 22న ప్రాంతీయ క్రీడా పాఠశాల యోగా హాల్లో జిల్లాస్థాయి సీనియర్స్ యోగాసన ఎంపిక పోటీలు నిర్వహించన్నుట్లు యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సర్దార్ రవీందర్ సింగ్, నాగిరెడ్డి సిద్ధారెడ్డి తెలిపారు. 18ఏళ్లు నిండిన పురుషులు, మహిళలు పాల్గొనవచ్చు. 22న ఉ.9 గం.కు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో కోచ్లు వి.కిష్టయ్య, పి.రామకృష్ణ వద్ద నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 8985275068ను సంప్రదించవచ్చు.

News August 15, 2025

KNR నగరపాలక సంస్థలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

image

కరీంనగర్ నగరపాలక సంస్థలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ముఖ్యఅతిథిగా హాజరవగా, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొయినుద్దిన్, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.