News March 18, 2025
కరీంనగర్: ఉద్యోగుల సేవలు అభినందనీయం: కలెక్టర్

తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డీ కాలనీలోని సూపరింటెండెంట్ ఇంజనీర్, నీటిపారుదల సర్కిల్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడంలో అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగుల సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
Similar News
News March 18, 2025
ఇల్లందకుంట: GREAT.. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్

నిన్న విడుదలైన గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఇల్లందకుంట మండలం సిరిసేడుకి చెందిన బీనవేని పరుశురాం ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్ సాధించి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పరుశురాముది పేద రైతు కుటుంబం. అయినప్పటికీ కష్టపడి చదివి 2023 పోలీస్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం పరుశురాం కేయూలో PHD చేస్తున్నాడు.
News March 18, 2025
KNR: ఇంటి వద్దకే రాములు వారి తలంబ్రాలు: ఆర్టీసీ RM

భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని అక్కడకు వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామని RM బి.రాజు తెలిపారు. ఇందుకు గాను ఒక్కొక్క ప్యాకెట్ కు రూ.151 ఆన్లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, ఏజెంట్ కౌంటర్ల వద్ద గాని బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
News March 18, 2025
KNR: వలస కార్మికుల పిల్లల చదువును ప్రోత్సహిస్తాం: కలెక్టర్

వలస కార్మికుల పిల్లల చదువులు ప్రోత్సహిస్తామని, ఇందుకోసం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వలస కూలీల కార్మికుల యజమానులు, మండల విద్యాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఎం.ఈ.ఓలు, ఇటుక బట్టీల యజమానులు పాల్గొన్నారు.