News May 13, 2024
కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో పోలింగ్ షురూ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. కాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది.
Similar News
News September 13, 2025
KNR: ‘ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం విషయాలపై అవగాహన వస్తోంది’

రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ భవనంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. శుక్రవారం సభల ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం తదితర విషయాలపై అవగాహన వస్తోందన్నారు. మహిళ తనతోపాటు తన పిల్లల పోషణ ఎలా ఉందో తెలుసుకోగలుగుతోందని సూచించారు.
News September 13, 2025
మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు: కరీంనగర్ కలెక్టర్

జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు.
News September 12, 2025
కరీంనగర్లో ఈనెల 17న జాబ్ మేళా

నిరుద్యోగులకు కరీంనగర్ కళ్యాణి జ్యువెలర్స్లో జాబ్స్ కోసం ఈనెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. 60 పోస్టులు ఉన్నాయని, డిగ్రీ పూర్తి చేసి, వయసు 19 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. వేతనం రూ.20,000 అని, ఆసక్తి గల వారు ఈనెల 17న KNR ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని, వివరాలకు 9052259333, 9944922677, 7207659969, 9908230384 నంబర్లను సంప్రదించాలని కోరారు.