News October 3, 2025

కరీంనగర్: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

కరీంనగర్ నగరంలోని విద్యానగర్‌లో దాసరి కృష్ణ కుమార్ గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చేర్ల బూత్కూర్ గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ కొంతకాలంగా KNRలో ఉంటున్నాడని, ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడినట్లు చెప్పారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీ గదికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 3, 2025

తిరుపతిలో బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు

image

తిరుపతిలోని విష్ణు నివాసం, రైల్వే స్టేషన్, లింక్ బస్టాండ్ వద్ద బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటలకుపైగా బాంబ్, డాగ్ స్క్వాడ్ లు తనిఖీ చేపట్టాయి. మొత్తం రెండు బృందాలు తిరుపతిలోని అధిక రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. కాగా తమిళనాడులో సినీ, రాజకీయ ప్రముఖులకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఇక్కడ పోలీస్ శాఖ అధికారులు అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది.

News October 3, 2025

‘స్త్రీనిధి’ చెల్లింపులకు యాప్.. ఎలా వాడాలంటే?

image

AP: బ్యాంకుకు వెళ్లకుండా నేరుగా స్త్రీనిధి వాయిదా చెల్లింపుల కోసం ప్రభుత్వం ‘కాప్స్‌ రికవరీ’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. అందులో సభ్యురాలి ఫోన్‌ నంబరు/పిన్‌‌తో లాగిన్‌ అవ్వాలి. గ్రూప్ పేరు సెలెక్ట్ చేస్తే లోన్ తీసుకున్నవారి లిస్ట్ కనిపిస్తుంది. పేరు క్లిక్‌ చేయగానే ఆమె చెల్లించాల్సిన మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తుంది. డబ్బు చెల్లించాక రసీదు జనరేట్ అవుతుంది.

News October 3, 2025

స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం: ఎస్ఈసీ

image

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమైంది. ఎంపీటీసీ, ZPTC ఎలక్షన్స్‌కు 37,652, పంచాయతీ ఎన్నికలకు 1,35,264 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం కాగా 1,18,547 ఉన్నాయని తెలిపింది. జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు దశల వారీగా 651 మంది, ఎంపీటీసీ ఎన్నికలకు 2,337 మంది ఆర్వోలు, 2,340 మంది ఏఆర్‌వోలు, 39,533 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 1,58,725 మంది ఇతర సిబ్బంది రెడీగా ఉన్నారని వివరించింది.