News February 11, 2025
కరీంనగర్: ఊరంతా బీసీ కమ్యూనిటీ వారే..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739256089574_1259-normal-WIFI.webp)
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఊరంతా బీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉండటం గమనార్హం. గ్రామంలో 750 జనాభా ఉండగా 623 ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఆరె, పద్మశాలి, కుర్మ, ముదిరాజ్, కమ్మరి, వడ్రంగి కులాలు చెందిన వారు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి కులాలకు చెందిన వారు లేరు. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కమ్యూనిటీ వారికే అవకాశం లభిస్తుంది.
Similar News
News February 11, 2025
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739275508075_653-normal-WIFI.webp)
జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలను ఎన్టీఏ రిలీజ్ చేసింది. అభ్యర్థులు <
News February 11, 2025
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739269902856_50011217-normal-WIFI.webp)
బాదేపల్లి మార్కెట్లో ఇవాళ 296 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగ 3,770 క్వింటాళ్లు అమ్మడానికి రాగా గరిష్ఠ ధర క్వింటాలుకు రూ. 6,809 లభించగా కనిష్ఠ ధర రూ. 4,265 లభించింది. కందులు 113 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.7,000, కనిష్ఠ ధర రూ. 4,002 లభించింది. మొక్కజొన్న 142 క్వింటాళ్లు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ. 2,361 కనిష్ఠ ధర రూ. 2,075 లభించింది.
News February 11, 2025
మాజీ క్రికెటర్కు సైబర్ నేరగాళ్ల ట్రాప్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739269296300_1045-normal-WIFI.webp)
సైబర్ నేరగాళ్లు తనను ట్రాప్ చేసేందుకు యత్నించారని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ట్విటర్లో తెలిపారు. ‘రూ.25వేలు కావాలంటూ ఓ సన్నిహితుడి నంబర్ నుంచి నాకు సందేశం వచ్చింది. అతడి ఫోన్ హ్యాక్ అయిందని నాకు ముందే తెలుసు. జీ పేలో పంపితే ఓకేనా అని అడిగాను. ఓ నంబర్ పంపించి పేమెంట్ స్క్రీన్ షాట్ కావాలన్నాడు. రూ.25వేలు సరిపోతాయా రూ.2.5 లక్షలు పంపించనా అని అడిగాను. ఇక మళ్లీ మెసేజ్ రాలేదు’ అని వెల్లడించారు.