News February 25, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోరు

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి?
Similar News
News November 8, 2025
ఏపీలో 10, 11 తేదీల్లో కేంద్ర బృందాల పర్యటన

AP: మొంథా <<18145441>>తుఫాను<<>> ప్రభావిత జిల్లాల్లో నష్టం అంచనా వేయడానికి 2 కేంద్ర బృందాలు ఈనెల 10, 11 తేదీల్లో పర్యటించనున్నాయి. హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమీ బసు నేతృత్వంలో మొత్తం 8మంది అధికారులు రాష్ట్రానికి రానున్నారు. వీరు 2 టీమ్లుగా విడిపోయి ప్రకాశం, బాపట్ల, ఏలూరు, కృష్ణా, తూ.గో, కోనసీమ జిల్లాల్లో రెండు రోజులు పర్యటిస్తారు. క్షేత్రస్థాయిలో పంట ఇతర నష్టాలను పరిశీలిస్తారు.
News November 8, 2025
కొత్తపల్లి: తండ్రికి తలకొరివి పెట్టిన ముగ్గురు కూతుళ్లు

కొత్తపల్లి గ్రామానికి చెందిన చెప్పులు కుట్టే వృత్తిదారుడు పులి దేవయ్య(65) అనారోగ్యంతో మృతి చెందారు. కుమారులు లేనప్పటికీ, దేవయ్యకు ముగ్గురు కూతుళ్లు సాంప్రదాయాన్ని పక్కనపెట్టి తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు చేశారు. పేదరికంలో ఉన్నప్పటికీ కూతుళ్లకు విద్యనందించి వివాహాలు చేసిన ఆయన ఆదర్శంగా నిలిచారు. దేవయ్య మరణం స్థానికులను విషాదంలో ముంచింది.
News November 8, 2025
2 నెలల్లో 2,717 మందిపై కేసు: SP

సెప్టెంబర్, అక్టోబరులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 2,182 మందిపై కేసులు నమోదు చేసినట్లు బాపట్ల SP ఉమామహేశ్వర్ శనివారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 535 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం 2,717 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. 4 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 224 ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని 55 వాహనాలకు రూ.1,57,405ల నగదు జరిమానా విధించామన్నారు.


