News March 5, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ కౌంటింగ్.. 23 మంది ఎలిమినేట్

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అధికారులు చేయనున్నారు. లెక్కింపునకు ముందు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికి 23 స్వతంత్ర అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Similar News
News December 15, 2025
సంగారెడ్డి: మూడో విడతకు భారీ బందోబస్తు

ఈనెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు ఎస్పీ రఘునందన్ రావు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్, కౌంటింగ్ ముగిసే వరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు.
News December 15, 2025
తిరుపతి: ఇంధన పరిరక్షణ వారోత్సవాలలో భాగంగా సైకిల్ ర్యాలీ

ఇంధన పరిరక్షణ వారోత్సవాల సందర్భంగా APSPDCL ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో సోమవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన ప్రాంతాల మీదుగా సాగింది. డైరెక్టర్లు అయూబ్ ఖాన్, గురవయ్య ర్యాలీని ప్రారంభించారు. సుమారు 200 మంది ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. భావితరాల కోసం ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని ఆదా చేయాలని పిలుపునిచ్చారు.
News December 15, 2025
ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

TG: రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటికే 394 పంచాయతీలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎల్లుండి(DEC 17) 182 మండలాల్లో మిగిలిన 3,752 పంచాయతీలు, 28,406 వార్డులకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. 11 గ్రామాలు, 112 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. తొలి రెండు విడతల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే.


