News September 10, 2024
కరీంనగర్: ఎమ్మెల్సీ పదవికి ఎత్తుగడలు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం ప్రకటన జారీ చేసింది. దీంతో ప్రధాన పార్టీలు బలమైన నాయకులను పోటీలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆశావహులు కూడా పోటీలో నిలబడేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.
Similar News
News October 6, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ జగిత్యాల, సిరిసిల్ల కలెక్టరేట్లో వైభవంగా బతుకమ్మ సంబరాలు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాక జయంతి వేడుకలు.
@ కథలాపూర్ మండలంలో హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్ట్.
@ కొండగట్టులో 100 గదుల నిర్మాణానికి స్థల పరిశీలన.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న దుర్గా నవరాత్రి ఉత్సవాలు.
@ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనును కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
News October 5, 2024
హుజూరాబాద్లో దారుణ హత్య
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాజపల్లెలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రాజు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 5, 2024
కోరుట్ల ఎస్సై- 2 శ్వేతను సస్పెండ్ చేసిన ఐజీ
జగిత్యాల జిల్లాలో కోరుట్ల పోలీస్స్టేషన్లో ఎస్సై-2 గా పనిచేసిన శ్వేతను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తిపై గత నెల29న ఎస్సై శ్వేత చేయిచేసుకున్నారని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీస్శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నివేదిక ఆధారంగా ఎస్సై-2 శ్వేతను సస్పెండ్ చేసినట్లు ఐజీ ప్రకటన జారీ చేశారు.