News August 28, 2025
కరీంనగర్: కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల నియామకం

TG యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా నూతన కోఆర్డినేటర్ నియామకం గురువారం జరిగింది. కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా కడారి కుమార్, ముక్కెర సతీష్ కుమార్ లు నియామకమయ్యారు. అదేవిధంగా మల్లికార్జున్, ప్రశాంత్ లను కో-కో ఆర్డినేటర్లుగా నియమించారు. వీరితో పాటు 6 అసెంబ్లీ కోఆర్డినేటర్లను నూతనంగా ఎంపిక చేశారు. స్థానిక సంస్థల విజయం కోసం పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ప్రచారంలో నియామకాలు జరిగాయి.
Similar News
News August 29, 2025
మాన్యువల్ స్కావెంజర్ రహిత జిల్లాగా కరీంనగర్

కరీంనగర్ జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు, అపరిశుభ్ర లాట్రిన్లపై సర్వే నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మే 21 నుంచి జూన్ 20వ తేదీ వరకు 318 గ్రామపంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలో ఈ సర్వే జరిగింది. సర్వేలో ఎవరూ మాన్యువల్ స్కావెంజర్లు లేరని, అపరిశుభ్ర లాట్రిన్లు కూడా లేవని తేలింది. దీంతో కరీంనగర్ జిల్లాను మాన్యువల్ స్కావెంజర్ రహిత జిల్లాగా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ప్రకటించారు.
News August 28, 2025
KNR: ‘అధికారులు అప్రమత్తంగా ఉండాలి’

కరీంనగర్ లోని లోయర్ మానేరు జలాశయాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే గురువారం సందర్శించారు. డ్యాములోకి వస్తున్న వరద ప్రవాహం వివరాలు తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని కుంటలు, చెరువుల పరిస్థితిని ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.
News August 28, 2025
రేపు కరీంనగర్ డ్యాం గేట్లు తెరిచే అవకాశం

కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిడ్ మానేరు నుంచి వరద లోయర్ మానేరు డ్యాంలోకి వస్తుందని, రేపు 10 గంటల వరకు స్పిల్వే వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని తెలిపారు. నది దిగువన గుండా పరిసర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మానేరు నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.