News April 10, 2025
కరీంనగర్: కూతురిని చంపి తల్లి సూసైడ్

పెద్దపలి టీచర్స్ కాలనీలో <<16048255>>కూతురిని <<>>చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. జూలపల్లి వాసి వేణుగోపాల్ రెడ్డితో KNR జిల్లా రామడుగు(M) వెదిరకు చెందిన సాహితి(26)కి పెళ్లైంది. రాత్రి వేణుగోపాల్ ఇంటికి వచ్చేసరికి కూతురు రితిన్యను చంపి భార్య ఉరేసుకుని కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 9, 2025
వికారాబాద్ బీజేపీ అధ్యక్ష పదవి జాప్యంపై ఉత్కంఠ

డాక్టర్ రాజశేఖర్రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంపై పార్టీలో చర్చ నడుస్తోంది. ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినా, అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ జాప్యానికి కారణం ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతు ఎవరికి ఉంటుందనే అంశంపై జిల్లా రాజకీయాల్లో భారీగా ఉత్కంఠ నెలకొంది.
News November 9, 2025
అన్నమయ్య: నూతన కమిటీ నియామకం

అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్.శ్రీలక్ష్మి, పి.రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా యం.గౌరి నియమితులయ్యారు. ఆ సంఘం 2వ జిల్లా మహాసభ మదనపల్లె ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగింది. 13 మంది ఆఫీస్ బేరర్లు, 33మందితో జిల్లా కమిటీ ఏర్పరిచారు.
News November 9, 2025
భద్రాద్రి: ఏ క్యాహై.. ఎమ్మెల్యే సాబ్ జర దేఖో..!

చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో మృతి చెందిన వారి అంతిమయాత్రలో బంధువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కబరస్థాన్ (శ్మశానవాటిక)కు వెళ్లే రోడ్డు మార్గం లోతైన గుంతలతో, బురదమయంగా మారింది. దీంతో గ్రామస్థులు మృతదేహాన్ని భుజాలపై కాకుండా, చేతులపై మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. సమస్య తీవ్రత దృష్ట్యా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పందించి, రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరారు.


