News February 24, 2025
కరీంనగర్: గం‘జాయ్’లో యువత

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. ఇటీవల రామగుండంలో 60 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 22 గంజాయి కేసులు నమోదు చేసి 48మందిని అరెస్టు చేశారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్టు చేశారు. ధర్మపురి మండలం మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేయడంతో అరెస్టు చేశారు.
Similar News
News October 17, 2025
VKB: జిల్లా బీజేపీ కన్వీనర్గా కరణం ప్రహ్లాద రావు

వికారాబాద్ జిల్లా బీజేపీ కన్వీనర్గా కరణం ప్రహ్లాద రావు శుక్రవారం నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి కొప్పు రాజశేఖర్ రెడ్డి సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. అదేవిధంగా జిల్లా బీజేపీ కన్వీనర్గా కరణం ప్రహ్లాద రావును నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని అన్నారు.
News October 17, 2025
JNTUH విద్యార్థులకు ALERT

కూకట్పల్లిలోని JNTU 14వ స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. డిసెంబర్లో స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 2024- 25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి UG, PG, PHD పూర్తైన విద్యార్థులు డిగ్రీల కోసం నవంబర్ 30లోపు వర్సిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు సూచించారు.
News October 17, 2025
కురుమూర్తి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన గోడపత్రికను శుక్రవారం మక్తల్లో మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, మంత్రులకు, జిల్లా ఎమ్మెల్యేలకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో వీర్లపల్లి శంకర్, దేవరకద్ర మత్స్యశాఖ ఛైర్మన్ మెట్టా సాయి కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.