News February 24, 2025

కరీంనగర్: గం‘జాయ్‌’లో యువత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. ఇటీవల రామగుండంలో 60 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 22 గంజాయి కేసులు నమోదు చేసి 48మందిని అరెస్టు చేశారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్టు చేశారు. ధర్మపురి మండలం మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేయడంతో అరెస్టు చేశారు.

Similar News

News December 29, 2025

TU: ‘అపరాధ రుసుముతో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించండి’

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా B.Ed, B.P.Ed మొదటి, మూడవ సెమిస్టర్ విద్యార్థులు అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు సోమవారమే ఆఖరు తేదీ అని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో నేడు ఫీజు చెల్లించవచ్చన్నారు. సెమిస్టర్ పరీక్షలు జనవరిలో నిర్వహిస్తామని, విద్యార్థులు తమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు.

News December 29, 2025

ఇవాళ అసెంబ్లీలో..

image

TG: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కాసేపట్లో మొదలు కానున్నాయి. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దివంగత సభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. అనంతరం సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయమై BAC నిర్ణయం తీసుకోనుంది. JAN 2న కృష్ణా, 3న గోదావరి బేసిన్ జలాలపై చర్చ జరగనుంది. కాగా 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని BRS పట్టుబడుతోంది.

News December 29, 2025

నరసరావుపేటలో కాలేజీ ప్రిన్సిపల్‌పై కత్తితో దాడి

image

నరసరావుపేటలో ఓ కాలేజీ ప్రిన్సిపల్‌పై దాడి జరిగింది. సోమవారం ఉదయం ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు వాకింగ్‌ చేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపల్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.