News March 5, 2025
కరీంనగర్: చెల్లని ఓట్లు 28,686

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలలో మొత్తం 2,52,029 మంది ఓటు వేయగా అందులో 2,23,343 ఓట్లు చెల్లుబాటు కాగా 28,686 ఓట్లు చెల్లుబాటు కానట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. 1,11,672 ఓట్లను కోటా నిర్ధారణ ఓట్లుగా నిర్ణయించారు. కాగా తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యత లభించింది.
Similar News
News November 11, 2025
పెద్దపల్లి BC JAC వైస్ ఛైర్మన్గా కొండి సతీష్

PDPL బీసీ JAC వైస్ ఛైర్మన్గా తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక విశ్లేషకుడు కొండి సతీష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర BC JAC ఆదేశాల మేరకు జిల్లా ఛైర్మన్ దాసరి ఉషా ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా కొండి సతీష్ మాట్లాడుతూ.. BCలకు రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. BCల ఐక్యత, కులవృత్తుల అభివృద్ధి, రాజకీయ శక్తివర్ధన దిశగా BC JAC కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
News November 11, 2025
కనురెప్పలు ఒత్తుగా పెరగాలంటే..

కనురెప్పలు ఒత్తుగా ఉంటే ముఖం అందంగా ఉంటుంది. దీనికోసం కొన్ని సహజ చిట్కాలు..* రాత్రి పడుకొనే ముందు ఒక చుక్క ఆముదాన్ని కనురెప్పలకు రాస్తే ఒత్తుగా పెరుగుతాయి. * గ్రీన్టీలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ కనురెప్పలు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడతాయి. గ్రీన్టీలో దూది ఉండను ముంచి కనురెప్పలపై అద్దాలి. ఇలా వారానికోసారి చెయ్యాలి. అయితే కనురెప్పలకు ఏవి రాసినా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కంట్లోకి వెళ్లి ఇబ్బంది పెడతాయి.
News November 11, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: 3PM UPDATE.. 40.20% ఓటింగ్ నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ప్రతి 2 గంటలకు సగటున 10 శాతం ఓటింగ్ నమోదు అవుతూ వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94% పోలింగ్ ఉండగా.. లంచ్ టైమ్ తర్వాత కూడా అదే విధంగా సాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు ఎంతమేర పోలింగ్ పెరుగుతుందో వేచి చూడాలి.


