News March 15, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

KNR జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఈదులగట్టేపల్లి 40.9°C నమోదు కాగా, జమ్మికుంట 40.7, నుస్తులాపూర్ 40.6, చిగురుమామిడి 40.5, ఇందుర్తి, అర్నకొండ, కొత్తపల్లి-ధర్మారం 40.4, గంగాధర 40.3, దుర్శేడ్, మల్యాల 40.2, గుండి 40.1, ఖాసీంపేట, రేణికుంట 40.0, KNR 39.9, గంగిపల్లి 39.8, వీణవంక 39.6, గట్టుదుద్దెనపల్లె, చింతకుంట, పోచంపల్లి 39.5, బురుగుపల్లి 39.3°C గా నమోదైంది.
Similar News
News March 15, 2025
KNR: ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన: KTR

కాంగ్రెస్ ప్రజాపాలనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ X ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన అని కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంపద సృష్టిస్తాం , ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికిన నాయకులు.. సగటున నెలకు రూ.10 వేల కోట్ల చొప్పున రూ.లక్ష 50 వేల కోట్లు అప్పు తెచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది అని అన్నారు.
News March 15, 2025
KNR: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.
News March 15, 2025
ధర్మపురి: బ్రహ్మోత్సవంలో సంస్కృతి నాట్య నీరాజనం

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కరీంనగర్కు చెందినటువంటి సంస్కృతి సంగీత నృత్యాలయం చిన్నారులు కూచిపూడి నృత్యాలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. రామా కోదండరామ, అన్నమాచార్య కీర్తన, అంతయు నీవే సౌభాగ్యలక్ష్మీ, రావమ్మ ఆనంద తాండవ, మాడెన్ శివుడు నృత్యాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు, ఈవో శ్రీనివాస్, గణేష్, నాట్యచార్యులు సురేంద్రచారి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.