News April 16, 2025
కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర, చిగురుమామిడి, రామడుగు మండలాల్లో 42.2°C నమోదు కాగా, శంకరపట్నం 41.8, గన్నేరువరం 41.7, జమ్మికుంట 41.4, మానకొండూర్ 40.9, కరీంనగర్ రూరల్, చొప్పదండి 40.7, తిమ్మాపూర్ 40.4, వీణవంక 40.3, కరీంనగర్ 40.2, హుజూరాబాద్ 40.0, కొత్తపల్లి 39.9, సైదాపూర్ 39.6, ఇల్లందకుంట 39.1°C గా నమోదైంది.
Similar News
News April 16, 2025
రామడుగు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రామడుగు మండల కేంద్రంలోని తాటి వనం వద్ద మోచ భూమయ్య మంగళవారం రాత్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News April 16, 2025
గల్ఫ్లో జగిత్యాల జిల్లా యువకుడి MURDER

బతుకుదెరువు కోసం గల్ఫ్కి వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం దుబాయ్లో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట చెందిన స్వర్గం శ్రీనివాస్ చంద్రయ్య పాకిస్తానీ చేతిలో హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్కు భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం గల్ఫ్ వెళ్లిన శ్రీనివాస్ ఇలా హత్యకు గురవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 16, 2025
KNR: పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ పూర్తిచేయాలి: కలెక్టర్

పైలట్ ప్రాజెక్టులో ఎంపికైన గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వర్క్ పూర్తిచేయాలని మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నిబంధనల ప్రకారం కట్టుదిట్టమైన ప్రణాళికతో అత్యంత నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. పొరపాటులకు తావివ్వరాదని అన్నారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.