News October 11, 2025

కరీంనగర్: టిక్కెట్లు ఇచ్చేది బీజేపీ నాయకత్వం

image

బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం నిర్ణయం మేరకే స్థానిక సంస్థల టికెట్లు కేటాయిస్తామని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఏ ఒక్క వ్యక్తి ప్రమేయంతో బీజేపీలో టికెట్లు రావన్నారు. పార్టీలో గ్రూపులు, వర్గాలు, అనుచరులకు టికెట్లు, బీ ఫామ్‌లు ఇచ్చే సంప్రదాయం బీజేపీలో ఉండదని స్పష్టం చేశారు.

Similar News

News October 11, 2025

రాష్ర్ట స్థాయికి రామడుగు మోడల్ స్కూల్ విద్యార్థులు

image

రామడుగు మోడల్ స్కూల్ విద్యార్థులు జిల్లాస్థాయి జానపద నృత్య పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎస్వీఆర్టీ ఆధ్వర్యంలో కళాభారతిలో ఈ పోటీలు జరిగాయి. విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించిన గైడ్ ఉపాధ్యాయుడు రత్నాకర్ కృషిని పాఠశాల ప్రిన్సిపల్ ఆడెపు మనోజ్ కుమార్ ప్రశంసించారు. విద్యార్థులను డీఈఓ మొండయ్య అభినందించారు.

News October 11, 2025

కరీంనగర్‌లో ఈనెల15 న జాబ్ మేళా

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగులకు ఈ నెల 15న జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి వయస్సు 25-30 లోపు ఉండాలని.. ఆసక్తిగల వారు ఉపాధి కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

News October 11, 2025

భూ సేకరణ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ రెవిన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. భారత జాతీయ రహదారి సంస్థ, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను గురించి చర్చించారు.