News February 16, 2025

కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

image

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Similar News

News January 3, 2026

అనకాపల్లి జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

అనకాపల్లి జిల్లాలో 83 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. కేజీబీవీ టైప్-3 విభాగంలో 20, టైప్-4 విభాగంలో 63 పోస్టులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

News January 3, 2026

ఏలూరు జిల్లా కస్తూర్బా స్కూళ్లలో ఉద్యోగాలు

image

కాకినాడ జిల్లాలో 2 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్ – 3 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. నేటి నుంచి జనవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. టెన్త్ పాసైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

News January 3, 2026

ఇంద్రకీలాద్రిపై ఆరుద్రోత్సవ పూజలు

image

ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జరిగే నటరాజస్వామి ఆరుద్రోత్సవ కళ్యాణ ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 1954లో నిర్మించిన ఈ ఆలయం, చిదంబరం ఆలయం తరహాలో చంద్రశిలలతో విగ్రహాలను కలిగి ఉంది. ఈ పూజల్లో ఆలయ కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్, నటరాజస్వామి ఆలయ నిర్మాణదాతలు చెన్నాప్రగఢ కోటంరాజు వంశీకులు నాగేశ్వరి దంపతులు, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, పాల్గొన్నారు.