News March 24, 2025

కరీంనగర్: డిప్లమో కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

టెక్స్ టైల్ టెక్నాలజీ డిప్లమో కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా జౌలి చేనేత శాఖ సహాయ సంచాలకులు సోమవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మంజూరైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ హైదరాబాద్ నందు మొదటి సంవత్సరానికి 60 సీట్లు ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ మొదటి వారంలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News September 17, 2025

ఉమ్మడి విశాఖలో 9మందికి ఎంపీడీవోగా పదోన్నతలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న 9 మంది ఏవో, ఈవో (EO PR&RD)లకు ఎంపీడీవోలుగా పదోన్నతి పొందారని జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. వారికి నియామక ఉత్తర్వులను జడ్పీ ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అందజేశారు. పదోన్నతి పొందిన వారు జి.కె. వీధి, బుచ్చయ్యపేట, రావికమతం, కశింకోట, కోటవురట్ల, నాతవరం, ఎస్.రాయవరం, పాయకరావుపేట, ముంచింగిపుట్టు మండలాలకు ఎంపీడీవోలుగా వెళ్లనున్నారు.

News September 17, 2025

భీమారం: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

image

జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. భీమారం మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి సుధాకర్‌తో కలిసి రైతులతో మాట్లాడారు. మండలంలో గత సంవత్సరం 14 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించబడిందని, ఈ సంవత్సరం ఇప్పటికే 11 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, వ్యవసాయ సాగుకు అవసరం మేర యూరియా అందిస్తామన్నారు.

News September 17, 2025

నేటి నుంచి మహిళకు ఉచిత వైద్య పరీక్షలు: అనకాపల్లి జేసీ

image

మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని అనకాపల్లి జేసీ ఎం.జాహ్నవి అన్నారు. ఈ పథకానికి సంబంధించి గోడ పత్రికను జాయింట్ కలెక్టరు కార్యాలయ ఛాంబర్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లాలోని 46 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో నేటి నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేసి అవసరమైన వైద్య సహకారాన్ని అందిస్తామన్నారు.