News October 10, 2024
కరీంనగర్: తమ్ముడిని చంపిన అన్న

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో మంగళవారం అర్ధరాత్రి తమ్ముడిని అన్న చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రేమలత-రాజయ్యకు కుమారులు కుమారస్వామి, చంద్రయ్య. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా, వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో చంద్రయ్య మద్యం తాగి అన్నతో గొడవకు దిగాడు. ఆవేశంతో కుమారస్వామి ఇనుపరాడ్తో దాడి చేయగా చంద్రయ్య చనిపోయాడు.
Similar News
News September 16, 2025
పోషణ మాసోత్సవాలకు ఎమ్మెల్యే కవ్వంపల్లికి రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరిగే పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనాయణకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మేరకు, కరీంనగర్ జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి, మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆహ్వాన పత్రాన్ని మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్లో ఎమ్మెల్యేకు అందజేశారు.
News September 16, 2025
కరీంనగర్: ‘చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలి’

మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలని, కరీంనగర్ జిల్లాలోని మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం మత్స్య శాఖ కమిషనర్ ఐఏఎస్ నిఖిలకు కరీంనగర్ జిల్లా మత్స్యకారులు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ మత్స్యశాఖ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని, చేప పిల్లలను సకాలంలో పంపిణీ చేస్తేనే మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు.
News September 16, 2025
కరీంనగర్: కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్గా విద్యాసాగర్

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ SC సెల్ కన్వీనర్గా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కనకం విద్యాసాగర్ నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు. LMDలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విద్యాసాగర్ను అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విద్యాసాగర్ తెలిపారు.