News February 16, 2025
కరీంనగర్: తల్లి, ఇద్దరు పిల్లల మృతిపై ఎస్సై వివరాల వెల్లడి

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎస్ఐ రవి కిరణ్ కరీంనగర్లో మీడియాతో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మద్దులపల్లి గ్రామానికి చెందిన <<15478542>>హారిక<<>> ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తాను తాగిందని చెప్పారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ తల్లి హారిక మృతిచెందగా, ఇద్దరు పిల్లలు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News July 6, 2025
పెద్దేముల్: ‘చదువు మధ్యలో మానేసిన యువతకు అవకాశం’

చదువుకోవాలని ఆశ ఉండి, చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ సువర్ణ అవకాశాలను కల్పిస్తుందని పెద్దేముల్ GHM సునీత పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో 25 ఓపెన్ స్కూల్లు అందుబాటులో ఉన్నాయన్నారు. పదో తరగతిలో చేరేందుకు 14 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వారు, ఇంటర్లో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.
News July 6, 2025
ఆంధ్ర మూలాలున్న పత్రికలను మేమెందుకు చదవాలి?: RSP

‘తెలంగాణ BRS జాగీరా?’ అంటూ వచ్చిన ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ఫైరయ్యారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ‘తెలంగాణ జ్యోతి’గా పేరు మార్చుకోకుండా సర్కులేట్ అవుతోందని మండిపడ్డారు. విశాలాంధ్ర మన తెలంగాణగా, ప్రజాశక్తి నవ తెలంగాణగా పేరు మార్చుకున్నాయని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకుల తొత్తులకు వెన్నంటి నిలిచే ఆంధ్రమూలాలున్న పత్రిక/ఛానళ్లను TG ప్రజలు ఎందుకు చదవాలని ప్రశ్నించారు.
News July 6, 2025
ఈనెల 10 లోపు శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత

ఈనెల 10 తేదీలోపు శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. రేపటి నుంచి డ్యాం ఇంజినీరింగ్ అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏ క్షణంలో అయినా డ్యామ్ గేట్లను తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.