News February 17, 2025

కరీంనగర్: తాగుడుకు బానిసై వృద్ధుడి ఆత్మహత్య

image

శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో ముప్పిడి రామ్ రెడ్డి (72)అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరుకు చెందిన రామ్ రెడ్డి తన మేన బామ్మర్ది తుమ్మల పురుషోత్తం రెడ్డి ఇంటివద్ద ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబ సభ్యులు దూరమడం వలన మనోవేదనతో తాగుడుకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పురుషోత్తం రెడ్డి పేర్కొన్నాడు.

Similar News

News September 17, 2025

చైతన్యానికి చెలిమై.. ఉద్యమానికి ఊపిరైంది మన పాలమూరు!

image

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ మరిగిన వేళ.. పాలమూరు ముఖ్య భూమిక పోషించింది. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక, గడియారం రామకృష్ణశర్మ రేడియో ప్రసారాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి.. ఉద్యమ జ్వాలలు పుట్టించారు. బూర్గుల రామకృష్ణరావు, అనంతలక్ష్మి మందుముల నర్సింగరావు లాంటి నేతలు ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. నిజాం పాలనను తుడిచిపెట్టిన ప్రజాస్వామ్య జెండాకు ఈ జిల్లా గొప్ప మద్దతుగా నిలిచింది.

News September 17, 2025

HYD: SEP 17.. పేర్లు మార్చిన పార్టీలు!

image

ఆపరేషన్ పోలోలో భాగంగా 1948, SEP 17న HYD సంస్థానం భారత్‌లో విలీనమైంది. ఇది జరిగి 77 ఏళ్లు పూర్తయినా ఏటా కొత్త చర్చనే. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం అని INC, విమోచనమని BJP అధికారికంగా వేడుకలు చేస్తోంది. ఇక సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, జాతీయ సమైక్యత అని BRS-MIM నేతలు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. తీరొక్క పేరుతో ఒకే కార్యక్రమం చేయడం గమనార్హం.

News September 17, 2025

సింగరేణి సంస్థకు సీఎండీగా బలరాం అర్హుడే..!

image

సింగరేణి సంస్థ సీఎండీ పదవికి బలరాం అనర్హుడని సంపత్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారించిన కోర్టు తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఫిర్యాదుదారుడైన సంపత్ కుమార్‌ను మందలించి రూ.20 వేల జరిమానా విధించింది. అన్ని విధాలా సీఎండీ బలరాం అర్హుడని కోర్టు స్పష్టం చేసింది. ఆధారాలు లేని కేసు వేసి కోర్టు సమయం వృథా చేయడంతో అతనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.