News December 17, 2025
కరీంనగర్: తుది దశకు పల్లె పోరు.. బరిలో 1580 మంది

పల్లె సమరం తుది దశకు చేరుకుంది. 1580 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరీంనగర్ జిల్లాలో 111 GPలకు 3 ఏకగ్రీవం కాగా 108 స్థానాలకు 451 మంది పోటీ పడుతున్నారు. SRCL జిల్లాలో 87 GPలకు 7 ఏకగ్రీవం కాగా 80 స్థానాలకు 379 మంది, జగిత్యాల జిల్లాలో 119 GPలలో 6 ఏకగ్రీవం కాగా 113 స్థానాలకు 456 మంది బరిలో నిలిచారు. PDPL జిల్లాలో 91 GPలలో 6 ఏకగ్రీవం కాగా 85 స్థానాలకు 294 మంది రేసులో ఉన్నారు.
Similar News
News December 25, 2025
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి

కాంగ్రెస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులను మంత్రి ఘనంగా సన్మానించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పర్యటన షెడ్యూల్ను విడుదల చేసింది.
News December 25, 2025
198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

TGSRTCలో 198 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ 114 ఉద్యోగాలను TSLPRB భర్తీ చేయనుంది. ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు పేస్కేల్ రూ.27,080-రూ.81,400 ఉంటుంది. అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు <
News December 25, 2025
ఇద్దరు మంత్రులు జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్

TG: రాష్ట్రంలోని ఇద్దరు మంత్రులు ₹వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వీరిపై కేంద్ర సంస్థలు నిఘా వేశాయని, ఎప్పటికైనా జైలుకెళ్లడం ఖాయమని మీడియాతో చిట్చాట్లో వ్యాఖ్యానించారు. ‘TGకి పట్టిన శని KCR కుటుంబం. అందుకే ప్రజలు ఫామ్హౌస్కు పరిమితం చేశారు. నీటివాటాలలో తప్పుచేసింది కేసీఆరే. CM రేవంత్ భాష సరికాదు. KCRను తిట్టడం వెనుక సింపతీ పెంచే కుట్ర ఉంది’ అని పేర్కొన్నారు.


