News March 4, 2025

కరీంనగర్: పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ అప్డేట్

image

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలో ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ఓట్లను లెక్కించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో సుమారు 21 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదన్నారు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయని ఇంకా 40 వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు విభజన చేయాల్సి ఉందన్నారు. మంగళవారంఉదయం 10 గంటల నుంచి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు.

Similar News

News March 4, 2025

BREAKING: ఎమ్మెల్సీ ఎన్నికలు.. మరో టీడీపీ అభ్యర్థి విజయం

image

AP: ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై గెలిచారు. ఏడో రౌండ్ ముగిసేసరికి 70వేల ఓట్ల వ్యత్యాసం ఉంది. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇది పూర్తయితే మెజార్టీలో స్వల్ప మార్పులుండొచ్చు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా ఎన్నికైన విషయం తెలిసిందే.

News March 4, 2025

మేలో ‘ఎల్లమ్మ’ షూటింగ్!

image

‘బలగం’తో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేణు తెరకెక్కించే కొత్త సినిమా ‘ఎల్లమ్మ’ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన వేణు.. తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ముంబైకి వెళ్లారు. మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

News March 4, 2025

రోహిత్ ఈ సారైనా టాస్ గెలువు: ఆకాశ్ చోప్రా

image

రోహిత్‌శర్మ ఈసారైనా టాస్ గెలవాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కోరారు. ఆసీస్‌తో మ్యాచ్‌‌లో టాస్ పాత్ర కీలకం కానుందని తన యూట్యూబ్ ఛానల్‌లో తెలిపారు. ఈ పిచ్‌లపై ఛేజింగ్ చాలా కష్టమని, సెమీస్‌లో టాస్‌ గెలవటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇప్పటివరకూ టాస్ ఓడినప్పటికీ మ్యాచులలో గెలిచింది. అయితే రోహిత్ శర్మ వరుసగా 10సార్లు టాస్ ఓడి రికార్డు సృష్టించారు.

error: Content is protected !!