News March 6, 2025
కరీంనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి 98,637 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 63,972 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 31, 2025
REWIND-2025: విశాఖ అభివృద్ధిలో కీలక మలుపు

2025లో ఉమ్మడి విశాఖ అభివృద్ధి దిశగా కీలక మలుపు తిరిగింది. ఐటీ, పరిశ్రమలు, మౌలిక వసతుల పరంగా రాష్ట్ర ఆర్థిక పటంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ ఏడాది విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన అంశంగా గూగుల్ డేటా సెంటర్ ప్రకటన నిలిచింది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదిత మిట్టల్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమల రంగంలో కొత్త ఆశలు రేపింది. మొత్తంగా 2025 విశాఖ అభివృద్ధి పునాదులు వేసిన ఏడాదిగా నిలిచింది.
News December 31, 2025
వర్ధన్నపేట ఎమ్మెల్యే పేరుతో సైబర్ వల..!

వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ఆయన పోలీస్ అధికారిగా ఉన్న సమయంలోని ఫేస్బుక్ అకౌంట్ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు, ఫ్రెండ్ లిస్ట్లోని వారితో చాట్ చేసి మొబైల్ నంబర్లు సేకరిస్తున్నారు. అనంతరం వాట్సాప్లో సంప్రదించి డబ్బులు పంపాలని బురిడీ కొట్టిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు బాధితులు డబ్బులు పంపినట్టు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News December 31, 2025
కొత్త ‘ఉపాధి’ చట్టంపై 5న ప్రత్యేక గ్రామ సభలు!

AP: MGNREGA స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన VB-G RAM G పథకంపై అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. పంచాయతీల్లో ప్రత్యేకంగా గ్రామ సభలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాల CSలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖలు రాసింది. దీంతో 5వ తేదీన రాష్ట్రంలో గ్రామసభలు నిర్వహించి, అవగాహన కల్పించాలని పంచాయతీ రాజ్ కమిషనరేట్ ఆదేశాలిచ్చింది. పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహించాలని అధికారులు సూచించారు.


