News February 27, 2025
కరీంనగర్: పోలింగ్ స్టేషన్లను సందర్శించిన కలెక్టర్

కరీంనగర్ లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. డాక్టర్ స్ట్రీట్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గల గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్ను, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్ను సందర్శించారు. పోలింగ్ సరళిపై ప్రిసైడింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 27, 2025
కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల అప్డేట్

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓటింగ్ 34.61% శాతం, ఉపాధ్యాయుల ఓటింగ్ 58.35% నమోదైనట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
News February 27, 2025
RTI ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవహారాల ఇంచార్జిగా రవి కుమార్

సమాచార హక్కు చట్టం ఆక్టీవిస్ట్స్ ఫోరమ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవహారాల ఇంచార్జి గా గోదావరిఖని కి చెందిన పోగుల రవికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు బత్తుల గణేశ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలుకు కృషి చేస్తానని చెప్పారు. ఆర్టీఐపై అవగాహన కార్యక్రమాలు చేపడతానని వెల్లడించారు.
News February 27, 2025
కరీంనగర్: గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నమోదైన వివరాలు

ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు గురువారం కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉదయం 08.00 గంటల నుంచి 12.00 గంటల వరకు 18.88 శాతం నమోదు అయింది. అలాగే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం ఉదయం 08.00 గంటల నుంచి 12.00 గంటల వరకు 34.98 శాతం నమోదు అయింది.