News August 29, 2025
కరీంనగర్ ప్రతినెల 30న పౌరహక్కుల దినోత్సవం

KNR జిల్లాలో పౌరహక్కుల దినోత్సవం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసింది. ప్రతి నెల 30న జరిగే ఈ సమావేశాల గురించి ప్రజలకు తెలియజేయాలని కోరింది. సమావేశం జరిగే గ్రామం, మండలం గురించి 2 లేదా 3 రోజుల ముందు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు ప్రజలు ఈ సమావేశాలలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని SC అభివృద్ధి శాఖ DD నాగైలేశ్వర్ తెలిపారు.
Similar News
News September 1, 2025
కరీంనగర్: ‘సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి’

కరీంనగర్లో ఎల్ఎండీకి సందర్శకుల తాకిడి పెరిగింది. నీటి మట్టం పెరగడంతో పాటు ఆదివారం కావడం వల్ల సాయంత్రం పెద్ద సంఖ్యలో కట్టపై నుంచి రిజర్వాయర్ లోకి వెళ్లారు. ప్రమాదకరంగా నీటిలోకి వెళ్ళి గడిపారు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ చేరుకుని సందర్శకులను అక్కడి నుండి పంపించేశారు. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.
News August 31, 2025
కరీంనగర్కి గర్వకారణం.. జాతీయ అవార్డు పొందిన రామకృష్ణ, సునీత

ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నేడు AP లోని నర్సరావుపేటలో తెలుగు భాష దినోత్సవం సందర్బంగా తెలుగు భాష, సంస్కృతి, వైభవం, సాహిత్యం తదితరాల్లో విశేష సేవలను అందిస్తున్నందుకు గాను తెలుగు తేజం పురస్కార అందిస్తుంది. ఇందులో భాగంగా SRR కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, చిందం సునీత జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు.
News August 31, 2025
KNR: నిజాయితీకి చిరునామా.. ఆటో డ్రైవర్ రాజేందర్

కరీంనగర్లోని పొలంపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాజేందర్, గీతాభవన్ వద్ద ఓ ప్రయాణికుడు మరచిపోయిన బ్యాగును తిరిగి అందజేశాడు. ఆ బ్యాగులో నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ప్రయాణికుడు దిగిన చోటికి వెళ్లి బ్యాగును సురక్షితంగా అప్పగించాడు. రాజేందర్ నిజాయితీని స్థానికులు, ప్రయాణికులు అభినందించారు.