News July 11, 2025
కరీంనగర్: ప్రాణం తీసిన కోతులు

హుజురాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బూర సుదర్శన్ మృతిచెందారని స్థానికులు తెలిపారు. నెల రోజుల క్రితం ఇంటి వద్ద అతడిపై కోతులు దాడి చేసి, కుడి కాలును కరిచాయని చెప్పారు. తీవ్రంగా గాయమై సెప్టిక్ అయినందున ఎంజీఎం ఆసుపత్రిలో 20 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతిచెందారన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కోతుల కారణంగా ప్రాణం పోయింది.
Similar News
News July 11, 2025
మరికల్: స్థానిక ఎన్నికలు. రిజర్వేషన్లపై ఉత్కంఠ

నారాయణపేట జిల్లాలో 13 జడ్పీటీసీలు, 136 ఎంపీటీసీలు, 272 సర్పంచులు, నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధం కావడంతో ఆయా మండలాల్లో ZPTC, MPTC, మున్సిపల్ ఛైర్ పర్సన్, కౌన్సిలర్, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్కై ఉత్కంఠ నెలకొంది. తాము ఆశించిన స్థానాలు రిజర్వేషన్లు తమకే దక్కే విధంగా నాయకులు పావులు కదుపుతున్నారు.
News July 11, 2025
సంగారెడ్డి: GPOలకు దరఖాస్తుల ఆహ్వానం

గ్రామ పాలన అధికారి పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య గురువారం తెలిపారు. దరఖాస్తులను https://forms. gle/rBDToMSakRcPoivWA వెబ్ సైట్లో ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మాజీ విఆర్ఓ, వీఆర్ఏలు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు.
News July 11, 2025
ఆస్పత్రిలో 2 గంటలున్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్!

ప్రస్తుతం 2 గంటలు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా క్లెయిమ్ చేస్తున్నాయి. దీనిపై పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ స్పందించారు. ‘గత పదేళ్లలో వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. గతంలో కొన్ని ఆపరేషన్లకు చాలా సమయం పట్టేది. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే 24 గంటలు పెట్టేది. ఇప్పుడు నిబంధనలు మార్చడంతో 1-2 గంటలే పడుతుంది’ అని పేర్కొన్నారు.