News March 3, 2025
కరీంనగర్: ప్రారంభమైన టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

కరీంనగర్లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, టీచర్స్ ఎమ్మెల్సీ ప్రాథమిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్ల విభజన చేశారు. ప్రస్తుతం టీచర్ల ఓట్ల కట్టలను టేబుల్స్ పైకి తీసుకొచ్చారు. మరి కొద్దిక్షణాల్లోనే టీచర్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ఓట్ల కౌంటింగ్ కోసం అధికారులు14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
Similar News
News November 8, 2025
బెల్లంపల్లి: చెక్ బౌన్స్.. జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా: సీఐ

చెక్ బౌన్స్ కేసులో ఒకరికి జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన నవీన్కు తీర్యాణి మండలం గంభీర్రావుపేటకు చెందిన శ్రావణ్ ఇచ్చిన రూ.10లక్షల చెక్ బౌన్స్ అయింది. నవీన్ కేసు వేశారు. నేరం రుజువు కావడంతో శ్రావణ్కు జడ్జి సంవత్సరం జైలు శిక్ష రూ.12 లక్షల జరిమానా విధించారు.
News November 8, 2025
సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా గజవాడ వేణు

వేములవాడకు చెందిన జడ్జి గజవాడ వేణు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మిర్యాలగూడ 5వ అదనపు న్యాయమూర్తి, సెషన్స్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక జడ్జి, హైదరాబాద్ 6వ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 20వ ముఖ్య న్యాయాధికారిగా నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
News November 8, 2025
చిత్తూరు, తిరుపతి జిల్లాలో నేటి ముఖ్యమైన కార్యక్రమాలు

☞ కుప్పం నియోజకవర్గంలో నేడు 7 కంపెనీలకు వర్చువల్గా<<18223647>> CM చంద్రబాబు శంకుస్థాపన<<>>
☞ రూ.2,203 కోట్ల పెట్టుబడులతో 22 వేల మందికి ఉపాధి
☞ నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న Dy.CM పవన్
☞ ఉదయం 8.05 రేణిగుంటకు వచ్చి అక్కడి నుంచి మామండూరు అటవీ క్షేత్రం చేరుకుంటారు
☞ ఉదయం 11 గంటలకు మంగళం రోడ్డులోని రెడ్ శాండిల్ గోడౌన్ తనిఖీ
☞ నేడు మధ్యాహ్నం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించనున్న పవన్


