News February 24, 2025

కరీంనగర్: బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 24 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

Similar News

News February 24, 2025

కరీంనగర్: గం‘జాయ్‌’లో యువత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. ఇటీవల రామగుండంలో 60 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 22 గంజాయి కేసులు నమోదు చేసి 48మందిని అరెస్టు చేశారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్టు చేశారు. ధర్మపురి మండలం మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేయడంతో అరెస్టు చేశారు.

News February 24, 2025

నేడు కరీంనగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి గెలుపు కోసం సోమవారం సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఈ సభకు కార్యకర్తలు తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ పిలుపునిచ్చారు. పట్టుభద్ధులతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.

News February 23, 2025

కరీంనగర్: పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈమేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న తెలంగాణ గిరిజనుల సంక్షేమ డిగ్రీ కళాశాల, మైనారిటీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రవేశపరీక్ష కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!