News March 30, 2025

కరీంనగర్: మండలాల వారీగా సమన్వయకర్తల నియామకం

image

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(AICC) దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ఏప్రిల్ 2 నుండి జిల్లాలో నిర్వహిస్తున్నందున ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మండలాల వారీగా సమన్వయకర్తలను నియమించారు. వీరు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలతో, మండల కాంగ్రెస్ అధ్యక్షులతో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో భారత రాజ్యాంగం, పరిరక్షణ స్వాతంత్రం గురించి ప్రజలకు వివరించనున్నారు.

Similar News

News December 28, 2025

కరీంనగర్: రేపటి నుంచి యథావిధిగా ‘ప్రజావాణి’

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి అర్జీదారులు హాజరుకావాలని సూచించారు. వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

News December 28, 2025

KNR: ప్రశాంతంగా వేడుకలు జరుపుకోండి: సీపీ

image

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం విజ్ఞప్తి చేశారు. కమిషనరేట్ పరిధిలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని, అతివేగం వల్ల ప్రమాదాల బారిన పడవద్దని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకాలని కోరారు.

News December 28, 2025

కరీంనగర్: ఓపెన్‌ స్కూల్‌ పరీక్షా ఫీజు గడువు ఖరారు

image

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల ఫీజు జనవరి 5 వరకు చెల్లించాలని జిల్లా కోఆర్డినేటర్‌ రామడుగు రవీందర్‌ తెలిపారు. 25 రూపాయల ఫైన్‌తో జనవరి 6 నుంచి 12 వరకు, 50 రూపాయల ఫైన్‌తో జనవరి 13 నుంచి 16 వరకు, అలాగే తత్కాల్‌ పద్దతి కింద జనవరి 17 నుంచి 19 వరకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. వివరాలకు 9440415099 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.