News September 27, 2024

కరీంనగర్: మత్స్యకారుల ఆందోళన!

image

మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత చేపల పంపిణీ కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు జరగకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం పూర్తి అవుతున్నప్పటికీ చేప పిల్లల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో అయోమయంలో పడ్డారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13,456 హెక్టార్లలో 1,008 చెరువులు, కుంటలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

Similar News

News February 25, 2026

KNR: ‘విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలి’

image

వచ్చే నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆకాంక్షించారు. కొత్తపల్లి మండలం చింతకుంట జడ్పీ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల నమూనా పరీక్ష పత్రాలను పరిశీలించి, వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలన్నారు.

News February 25, 2026

‘కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదు’

image

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.

News February 25, 2026

‘కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదు’

image

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.