News February 11, 2025

కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు

image

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం నిన్నటితో ముగిసింది. సోమవారం పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 17 మంది నామినేషన్లు వేశారు. నేడు నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈనెల 13న మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది.

Similar News

News November 4, 2025

మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో వర్షం

image

రానున్న 2-3 గంటల్లో నగరంలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముండగా, ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీలోపు ఉండే అవకాశం ఉందని సూచించింది. ప్రజలు వర్షం సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

News November 4, 2025

కూటమి ప్రభుత్వం రైతుల వెన్ను విరిచింది: జగన్

image

కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రూ. 40 వేల పెట్టుబడి సాయం ఇవ్వాల్సింది పోయి, కేవలం రూ.5 వేలు ఇచ్చి రైతు వెన్ను విరిచారు అని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఉచిత ఇన్సూరెన్స్ ఉండేదని, ఇప్పుడు ఎరువులు కూడా బ్లాక్‌లో కొనే పరిస్థితి వచ్చిందని, రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

News November 4, 2025

తిరుపతి: విధుల నుంచి ఇద్దరు టీచర్లు తొలగింపు

image

తిరుపతి జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు 3 సంవత్సరాలుగా సమాచారం లేకుండా ఉద్యోగానికి రావడం లేదు. శ్రీకాళహస్తి మండలం ఓబులేలపల్లి ZP హైస్కూల్ వ్యాయమ ఉపాధ్యాయుడు ఏ.బాలకృష్ణ. రేణిగుంట మండలం గుండ్లకలువ MPPS SGT టీచర్ పి.దేవరాజును ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో కుమార్ ఆదేశాలు జారీ చేశారు.