News May 18, 2024
కరీంనగర్: ముగ్గురు టీచర్ల సస్పెన్షన్.!
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మంగ, సైదాపూర్ మండలం నల్లోనితండా పాఠశాల ఉపాధ్యాయురాలు సునీతలను డీఈవో జనార్దన్రావు సస్పెండ్ చేశారు. ఆయా పాఠశాలల్లో అనధికారిక వ్యక్తులు నివాసం ఉంటున్నారనే సమాచారం తెలియజేయకపోవడంతో విధుల నుంచి తొలగించారు. అదేవిధంగా కరీంనగర్ పట్టణం ఫకీర్ నగర్ స్కూల్ టీచర్ మంజులను విధులకు గైర్హాజరు కారణంగా సస్పెండ్ చేశారు.
Similar News
News October 4, 2024
జగిత్యాల: ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 14 రోజుల రిమాండ్
జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పోక్సో కేసులో 14 రోజుల రిమాండ్ను మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జితేందర్ విధించారు. ఓ ఉపాధ్యాయుడు కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసి గురువారం రాత్రి జగిత్యాల సబ్ జైలుకు అతడిని తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు.
News October 4, 2024
కరీంనగర్: రూ.17.88 కోట్ల బకాయిలు!
కరీంనగర్ జిల్లాలోని పలు మహిళా సంఘాలు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు ఉపాధితో పాటు ఇతర అవసరాలకు రుణాలు వినియోగించుకుంటున్నారు. కొందరు చెల్లించలేకపోవడంతో వడ్డీ, అసలు కలిపి భారంగా మారుతున్నాయి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నగర, పురపాలికల్లో వేల సంఖ్యలో స్వశక్తి సంఘాలు పనిచేస్తున్నాయి. రుణం చెల్లించని సంఘాలు 576 ఉండగా, రూ.17.88 కోట్ల బకాయిలు ఉన్నాయి.
News October 4, 2024
పెద్దపల్లి: టెన్త్ విద్యార్థి మృతి
పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన కంటే చిన్నా(15) అనే పదో తరగతి విద్యార్థి వైరల్ ఫీవర్తో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే గత పదిరోజులుగా చిన్నా జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల నుంచి జ్వరం విషమించడంతో రెండు కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.