News October 26, 2025
కరీంనగర్: విద్యాసాగర్కి డాక్టరేట్..!

శాతవాహన విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ కళలు, సామాజికశాస్త్ర కళాశాలలోని అర్థశాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి కె.విద్యాసాగర్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సాగర్ పరిశోధన గ్రంథం ప్యాటర్న్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్డిచర్ ఆన్ ఎడ్యుకేషన్: ఏ స్టడీ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన చేశారు. అర్ధశాస్త్ర విభాగాధిపతి డా.కోడూరి శ్రీవాణి పర్యవేక్షణలో డాక్టరేట్ అందజేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు.
Similar News
News October 26, 2025
జూబ్లీహిల్స్ బరిలో పాలమూరు బిడ్డ అస్మా

మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం తిర్మలాపూర్కు చెందిన షేక్ హుస్సేన్, సాబేర బేగం కుమార్తె అస్మా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఎం.ఏ. తెలుగు పూర్తి చేసిన ఆమె గతంలో నిరుద్యోగుల తరఫున పోరాటం చేశారు. అస్మా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆమెకు సంపూర్ణ మద్దతు తెలిపింది.
News October 26, 2025
NGKL: మద్యం టెండర్లతో జిల్లాకు రూ.450.04 కోట్ల ఆదాయం

నాగర్కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ద్వారా రూ.450 కోట్ల 4 లక్షల ఆదాయం వచ్చింది. జిల్లాలోని 67 దుకాణాలకు 1,518 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో టెండర్కు రూ.3 లక్షల చొప్పున వసూలు చేయడంతో ఈ ఆదాయం సమకూరింది. నాగర్కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి 500కు పైగా దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
News October 26, 2025
భోజనం చేశాక ఈ శ్లోకం పఠిస్తే..?

రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినామ్ |
అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు ||
భోజనం చేసిన తర్వాత ఈ శ్లోకం పఠిస్తే దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మనం తినడానికి ముందు ఆకలి, దాహంతో ఉన్నవారిని గుర్తు చేసుకొని, కరుణతో కొన్ని మెతుకులు పక్కన పెట్టాలి. ఫలితంగా వారి ఆకలి తీరేలా సానుకూల శక్తులు తోడ్పడతాయని అంటున్నారు. వారి కోర్కెలు తీర్చిన పుణ్యం మనకు దక్కుతుందని నమ్మకం.


