News February 18, 2025
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ.పురుషోత్తం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన కందులను వ్యవసాయ మార్కెట్లో విక్రయించి రూ.7,550 మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ సిబ్బంది, DCMS సిబ్బంది, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.
Similar News
News March 12, 2025
సైదాపూర్: గ్రూప్-2 RESULT.. యువకుడికి 70వ ర్యాంక్

సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్కి చెందిన సంతపురి నిఖిల్ రెడ్డి గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రంలో 70వ ర్యాంకు సాధించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిఖిల్ రెడ్డి గతంలో గ్రూప్-4లో 7వ ర్యాంకు సాధించి ప్రస్తుతం కరీంనగర్ డీటీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
News March 12, 2025
గ్రూప్-2లో ఎక్లాస్పూర్ వాసీకి 70వ ర్యాంక్

సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్కి చెందిన సంతపురి నిఖిల్ రెడ్డి గ్రూప్-2లో 70వ ర్యాంకు సాధించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిఖిల్ రెడ్డి హుజూరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులోని నారాయణ జూనియర్ కళాశాలలో చదివారు. గతంలో గ్రూప్-4లో 7వ ర్యాంకు సాధించి ప్రస్తుతం కరీంనగర్ డీటీవో కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు.
News March 12, 2025
కరీంనగర్: మూడురోజులు ఫ్లెక్సీ షాపులు బంద్

కరీంనగర్లోని ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపులు మూడురోజుల బంద్కు పిలుపునిచ్చినట్లు ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ తెలిపారు. GST పెంపు ధరలు, ముడి సరుకులు, ట్రాన్స్పోర్ట్ ధరలు అధికంగా పెరగడం వలన పాత ధరల్లో తాము పనులు చేయలేక సతమతమవుతున్నామన్నారు. సభ్యులందరూ కలిసి ఒక ధరను నిర్ణయించి వాటిని అమలు చేసే ప్రయత్నంలో భాగంగా 12, 13, 14వ తేదీల్లో బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.