News August 23, 2025

కరీంనగర్: సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌కు మణికంఠ రెడ్డి ఎన్నిక

image

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కరీంనగర్‌కు చెందిన కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఎన్నికయ్యారు. మల్కాజిగిరిలో జరిగిన సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన మణికంఠ రెడ్డిని ఎన్నుకోవడం పట్ల పార్టీ జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి ఆయన కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News September 3, 2025

KNR: రేపటి నుంచి వైన్స్ బంద్

image

వినాయక నిమజ్జనం నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 4వ తేదీ(రేపు) ఉదయం 6 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి పి.శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం A4 దుకాణాలు, 2B బార్లు, CI క్లబ్స్, కల్లు దుకాణాలు/డిపోలు, మిలిటరీ క్యాంటీన్ & టి.ఎస్.బి.సి.ఎల్ KNR డిపో మూసివేయాలని అదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.

News September 3, 2025

KNR: మానేరు రివర్ ఫ్రంట్ పరిశీలించిన కలెక్టర్

image

మానేరు రివర్ ఫ్రంట్‌ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. రివర్ ఫ్రంట్ నిర్మాణ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలను ఈ సందర్భంగా ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు భూములు సేకరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు ఉన్నారు.

News September 3, 2025

KNR: ‘NH భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి’

image

కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, భారత జాతీయ రహదారి సంస్థ ప్రాంతీయ అధికారి శివశంకర్, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు నాగరాజు, రెవెన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో జిల్లా కలెక్టర్ మంగళవారం భూసేకరణ సమస్యలపై సమావేశం నిర్వహించారు.