News October 19, 2025
కరీంనగర్: 72 గంటల్లోపే నగదు, బోనస్

ధాన్యం విక్రయించిన 72 గంటల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం ఖరీదుతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు వ్యవసాయ శాఖ అధికారులను సమాయత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించింది.రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే క్వాంటిటీ, గ్రేడ్, అకౌంట్ నంబర్లను వ్యవసాయ శాఖ పోర్టల్లో నమోదు చేయాలని సూచించింది.ఉమ్మడి జిల్లాలో 1,32,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అధికారుల అంచనా.
Similar News
News October 19, 2025
ASF: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

నిరుపేదల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధి పొందిన వారు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం ASF కలెక్టరేట్ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పంచాయతీ కార్యదర్శుల హాజరు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
News October 19, 2025
ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలి: GWMC మేయర్

వరంగల్ నగరంలో బాణాసంచా విక్రయదారులు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బాణాసంచా దుకాణదారులు పాటించాల్సిన విధి విధానాలు, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలపై బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించడానికి తగిన సూచనలు చేశారు. పండుగ వేళ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రజల భద్రతే తమ మొదటి కర్తవ్యం అని పేర్కొన్నారు.
News October 19, 2025
అక్టోబర్ 19: చరిత్రలో ఈ రోజు

1952: ప్రత్యేకాంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభం
1917: గణిత శాస్త్రవేత్త ఎస్ఎస్ శ్రీఖండే జననం
1955: నిర్మాత, దర్శకుడు గుణ్ణం గంగరాజు జననం
1987: భారత టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని జననం
1986: ఏపీ మాజీ సీఎం టంగుటూరి అంజయ్య మరణం
2006: నటి, గాయని శ్రీవిద్య మరణం
2015: హాస్యనటుడు కళ్లు చిదంబరం మరణం