News March 28, 2025
కరీంనగర్ DRDOకు ‘స్త్రీనిధి’లో రాష్ట్ర స్థాయి అవార్డు

స్త్రీనిధిలో గత ఆర్థిక సంవత్సరంలో 115 శాతం రుణ పంపిణీ, 90 శాతం రికవరీ చేసినందుకు గాను DRDO కు అవార్డు వచ్చింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా అదనపు DRDO సునీత అవార్డు అందుకున్నారు. కరీంనగర్ DRDO అవార్డ్ అందుకోవడం పట్ల కలెక్టర్ పమేలా సత్పతి డిఆర్డిఓను, సిబ్బందిని అభినందించారు. పేద మహిళలకు స్త్రీనిధి ద్వారా మరిన్ని సేవలు అందించాలని అన్నారు.
Similar News
News March 30, 2025
కరీంనగర్: మండలాల వారీగా సమన్వయకర్తల నియామకం

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(AICC) దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ఏప్రిల్ 2 నుండి జిల్లాలో నిర్వహిస్తున్నందున ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మండలాల వారీగా సమన్వయకర్తలను నియమించారు. వీరు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలతో, మండల కాంగ్రెస్ అధ్యక్షులతో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో భారత రాజ్యాంగం, పరిరక్షణ స్వాతంత్రం గురించి ప్రజలకు వివరించనున్నారు.
News March 30, 2025
కరీంనగర్: దరఖాస్తుకు రేపే చివరి తేదీ

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం.. ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్సీవో అంజలి కుమారి తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 20న పరీక్ష జరుగుతుందని, అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రిజర్వేషన్, నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
News March 30, 2025
కరీంనగర్: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

సుల్తానాబాద్(M) గర్రెపల్లిలో SRCL(D) తంగళ్లపల్లి(M) చీర్లవంచకు చెందిన పత్రి కళావతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గంగాధర పంచాయతీ కార్మికుడు షాహిద్(28) గుండెపోటుతో మరణించాడు. JGTL(M) తిప్పన్నపేటకు చెందిన చింతకుంట్ల రాజనర్సయ్య(58) విద్యుదాఘాతంతో చనిపోయాడు. తంగళ్లపల్లి(M) బస్వాపూర్కు చెందిన బంటు ఆనందం చెట్టుపై నుంచి పడి మృతిచెందాడు. KNRలోని రేకుర్తిలో చెరువులో పడి శ్రీనిధి అనే <<15924920>>బాలిక<<>> చనిపోయింది.