News August 19, 2025
కరీంనగర్: RTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ

KNR-2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు DM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారం, సామర్లకోటలోని వివిధ దర్శనీయ స్థలాల సందర్శనకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామన్నారు. ఆగస్ట్ 21న రా.10 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి AUG 24న KNR చేరుకుంటుందని చెప్పారు. పెద్దలకు రూ.3,300, పిల్లలకు రూ.2,500ల టికెట్ అన్నారు. వివరాలకు 9398658062ను సంప్రదించాలన్నారు.
Similar News
News August 19, 2025
KNR: ‘సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి’

KNR కలెక్టరేట్ ఆడిటోరియంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న చిత్రపటానికి కలెక్టర్ పమేలా సత్పతి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక సమానత్వానికి కృషి చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని అన్నారు.
News August 19, 2025
పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలి: కరీంనగర్ కలెక్టర్

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహాల్లో పెరుగుతున్న 3 ఏళ్ల పాపను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా USAకు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. వీరికి ఇది వరకే బాబు జన్మించగా ఆడశిశువు దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం విచారించి ఆడ శిశువును కలెక్టర్ సోమవారం దత్తత ఇచ్చారు. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
News August 18, 2025
కరీంనగర్: లారీ ఢీకొని వ్యక్తి మృతి

నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. చాకుంత గ్రామానికి చెందిన హస్తపురం రవి, బొమ్మకల్ ఫ్లైఓవర్పై నడుచుకుంటూ వెళుతుండగా, వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్లక్ష్యంగా లారీ నడిపిన డ్రైవర్ కృష్ణకుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.