News December 25, 2025

కర్ణాటక ప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న 60 మంది చిన్నారులు!

image

కర్ణాటక బస్సు <<18664780>>ప్రమాదం<<>> నుంచి ఓ స్కూల్ బస్సు త్రుటిలో తప్పించుకుంది. ఆ ప్రైవేటు బస్సు వెనకే ఇది కూడా వెళ్తున్నట్లు తెలిసింది. లారీ-బస్సు ఢీకొనడంతో స్కూల్ బస్సు డ్రైవర్ వెంటనే పక్కకు తిప్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో 60 మంది పిల్లలున్నారు. వారు బెంగళూరు నుంచి ఉత్తర కన్నడలోని దండేలికి ట్రిప్ వెళ్తున్నారు. మృతుల ఫ్యామిలీలకు ₹2 లక్షలు, క్షతగాత్రులకు ₹50 వేల పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు.

Similar News

News December 27, 2025

‘పుష్ప-2’ తొక్కిసలాట.. ఛార్జ్‌షీట్ దాఖలు

image

TG: గత ఏడాది ‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా HYDలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, ఏ-11గా అల్లు అర్జున్‌ను పేర్కొన్నారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

News December 27, 2025

కృష్ణా జిల్లాలో 60 పోస్టులకు నోటిఫికేషన్

image

AP: హెల్త్ మెడికల్&ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ కృష్ణా జిల్లాలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, MLT, BSc(MLT), ఇంటర్ ఒకేషనల్ (MLT, ఫార్మసీ), DMLT, డిప్లొమా, బీఫార్మసీ, PGDCA, డిగ్రీ(కంప్యూటర్స్) ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. వెబ్‌సైట్: https://krishna.ap.gov.in/

News December 27, 2025

సాగులో భూసార పరీక్షలు కీలకం.. నిర్లక్ష్యం వద్దు

image

భూమిలో ఏ పంటలు వేయాలి, ఏ మందులు ఎంత మోతాదులో వేయాలో తెలియక రైతులు అధికమొత్తంలో రసాయన ఎరువులను వాడుతున్నారు. ఇది సాగుభూమికి శాపంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా భూసార పరీక్ష, నీటి పరీక్ష, అవసరమైతే పత్ర విశ్లేషణ పరీక్షలు చేయించాలి. వీటి వల్ల నేల, నీరు, ఆకులు, మొక్కల్లో ఏ పోషకాలున్నాయి, పంటలకు ఏ ఎరువులు ఎంత వేయాలనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. ఎరువుల వాడకంలో సమతుల్యత పాటిస్తే భూమి సారవంతమవుతుంది.