News September 7, 2025
కర్నూలులో ఏఐ టెక్నాలజీతో 100 సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు: మంత్రి

కర్నూలులో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏఐ టెక్నాలజీతో కూడిన 100 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. శనివారం ప్రభుత్వ అతిథి గృహంలో కెమెరాల ఏర్పాటుకు కుడా నిధులు రూ.29.84 లక్షల చెక్కును ఎస్పీ విక్రాంత్ పాటిల్కు మంత్రి అందజేశారు. కలెక్టర్ రంజిత్ బాషా, జేసీ నవ్య, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Similar News
News September 8, 2025
ఈనెల 9న కర్నూలు జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీలు

ఈనెల 9న ఉదయం 10 గంటలకు కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జిల్లాస్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో సెపక్ తక్రా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం కార్యదర్శి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీల్లో ఉరవకొండలో (సబ్ జూనియర్స్) అలాగే 27, 28 తేదీల్లో ఒంగోలులో (సీనియర్స్) విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
News September 7, 2025
కర్నూలు యోగా జట్టుకు మూడో స్థానం

ద్వారక తిరుమల వేదికగా ఈ నెల 6, 7 తేదీలలో నిర్వహించిన 50వ రాష్ట్రస్థాయి యోగా పోటీలలో కర్నూలు జిల్లా జట్టు పాల్గొని 25 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచినట్లు రాష్ట్ర యోగ సంఘం ఛైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టుదలతో సాధన చేసి పథకాల సాధించడం గర్వకారణమని అన్నారు. జిల్లా అధ్యక్షుడు అవినాశ్ శెట్టి, సెక్రెటరీ ముని స్వామి హర్షం వ్యక్తం చేశారు.
News September 7, 2025
ఈనెల 9న కర్నూలు జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీలు

ఈనెల 9న ఉదయం 10 గంటలకు కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జిల్లాస్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో సెపక్ తక్రా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం కార్యదర్శి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీల్లో ఉరవకొండలో (సబ్ జూనియర్స్) అలాగే 27, 28 తేదీల్లో ఒంగోలులో (సీనియర్స్) విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.