News March 31, 2024

కర్నూలులో ఏడాది క్రితం మిస్సైన మూడు కూనలు హైదరాబాద్‌లో సేఫ్

image

కర్నూలు జిల్లాలో 2023 మార్చిలో నాలుగు పులి పిల్లలు మిస్ అయ్యాయి. అయితే వాటిని తిరుపతి SV జూ పార్క్‌కు తరలించి అధికారులు సంరక్షించారు. వాటిలో ఒకటి మరణించగా మరో మూడింటికీ రుద్రమ్మ, అనంత, హరిణి అని పేరు పెట్టారు. వీటిని ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కి చెందిన జీఏఆర్ సంస్థ ఏడాది పాటు దత్తత తీసుకుంది. గడువు ముగిస్తే మళ్లీ అధికారుల ఆదేశాలతో నిర్ణయం తీసుకుంటామని SVజూపార్క్ క్యూరేటర్ సెల్వం తెలిపారు.

Similar News

News March 21, 2025

పాస్టర్ల వేతనాలకు రూ.12.82 కోట్లు విడుదల

image

రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు వేతనాల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.12.82 కోట్లు విడుదల చేసిందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ మేరకు అమరావతిలో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 8427 మంది పాస్టర్లకు నెలకు ఒక్కొక్కరికి రూ.5000 ప్రకారం వేతనం ఇస్తామన్నారు. గతేడాది మే నెల నుంచి పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు.

News March 21, 2025

కర్నూలు జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

image

రాష్ర్ట ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమైన అన్ని శాఖల జిల్లా అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల అమలు, పురోగతిపై కలెక్టర్ చర్చించారు.

News March 20, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనుకుంటే పొరపాటే అనుకున్నారేమో ఆ రైతులు➤ ఈ నెల 22న ఓర్వకల్లుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక➤ ఆటో బోల్తా.. 10 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు➤ డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్➤ జగన్ ఆదేశాలకు కట్టుబడి ఉంటా: ఆదోని మున్సిపల్ ఛైర్మన్➤ ట్రోఫీలు అందుకున్న జిల్లా నేతలు➤ పాఠశాలలు నిబంధనలు పాటించకపోతే కొరడా తప్పదు: డీఈవో➤ ఈతకెళ్లి ముగ్గురు మృతి

error: Content is protected !!