News February 26, 2026

కర్నూలులో ‘జై రాజ్ ATOOT 550D TMT బార్స్’ గ్రాండ్ లాంచ్

image

కర్నూలులో ఈనెల 21-22న జరిగిన ‘ATOOT ఆంధ్ర’ కార్యక్రమంలో Jai Raj ATOOT 550D TMT బార్స్‌ను ఆవిష్కరించారు. రాయలసీమ, కోస్టల్ ఆంధ్ర ప్రాంతాల డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. రిటైల్ డీలర్లతో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలపరచడం, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడం, నాణ్యత, దృఢత్వానికి కొత్త ప్రమాణాలను స్థాపించడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News March 1, 2026

ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

image

ఇరాన్ ‘సుప్రీం’ ఖమేనీని అంతం చేసిన US అక్కడి ప్రభుత్వ మార్పుపై ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారుతోంది. ఇరాక్‌లో సద్దాం అంతం అనంతరం ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా US అండతోనే పాలన సాగింది. వెనిజులాలో అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసినా అక్కడి ప్రభుత్వాన్నే కొనసాగించింది. అయితే ఇరాన్‌లో అలా సాధ్యం కాదని, భిన్నమైన వ్యూహంతో వెళ్లొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్గత కలహాలతో GOVT కూలిపోవచ్చంటున్నారు.

News March 1, 2026

పోకో, రెడ్‌మీ ఫోన్ల ధరలూ పెరిగాయి

image

ఇప్పటికే వివో, iQOO, శాంసంగ్ సంస్థలు <<19253401>>ఫోన్<<>> ధరలు పెంచేయగా.. ఈ లిస్ట్‌లో ఇప్పుడు మరో రెండు బ్రాండ్లు చేరాయి. పోకో తన C75, M7, C85, M7 ప్లస్, F7 మోడళ్లలోని వివిధ వేరియంట్లపై ₹1000-₹2500 వరకు ధరలు పెంచింది. ఇకపై పోకోలో బేస్ మోడల్ ఫోన్ ధర ₹10,999గా ఉండనుంది. ఈ హైక్ ఈరోజే అమలులోకి రానుంది. రెడ్‌మీ సైతం ఇదే స్థాయిలో పెంచినట్లు సమాచారం. మెమొరీ చిప్‌ల కొరతతో కంపెనీలు ధరలు పెంచాల్సి వస్తోంది.

News March 1, 2026

నెలకు రూ.74వేల జీతం.. NPCILలో ఉద్యోగాలు

image

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(<>NPCIL<<>>)లో 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 4వరకు అవకాశం ఉంది. GATE-2024, 2025, 2026 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.74,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://npcilcareers.co.in