News April 12, 2026

కర్నూలులో 3.1 కిలోల గంజాయి స్వాధీనం.. 8 మంది అరెస్ట్

image

కర్నూలు టౌన్ బళ్లారి చౌరస్తా సమీపంలోని వీకర్ సెక్షన్ కాలనీలో పోలీసులు దాడి చేసి 3.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఫోర్త్ టౌన్ సీఐ విక్రమ్ సింహ తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు సహా కొనుగోలు, పంపిణీకి వచ్చిన మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితులు అరకు ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 14, 2026

KBR బార్ గొడవ కేసులో మరో ఇద్దరి అరెస్ట్: డీఎస్పీ

image

కర్నూలు కేబీఆర్ బార్ వద్ద జరిగిన గొడవలో విద్యార్థి జాన్ వేస్లీ మృతి కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు DSP ఉపేంద్ర బాబు తెలిపారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా రాజీవ్ నగర్‌కు చెందిన శాంతిరాజు రెడ్డి, తులాసాపురం శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులను గుర్తించినట్లు, వారి అరెస్టుకు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ వివరించారు.

News April 14, 2026

నిరుద్యోగులకు జాబ్ మేళా

image

యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సూచించారు. ఏప్రిల్ 21న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9:30 నుంచి ఈ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.

News April 14, 2026

నిరుద్యోగులకు జాబ్ మేళా

image

యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సూచించారు. ఏప్రిల్ 21న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9:30 నుంచి ఈ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.