News September 5, 2025
కర్నూలు: ఆయన.. ఓ టీచర్, నటుడు, డైలాగ్ రైటర్, టీ స్టాల్ మాస్టర్

వెల్దుర్తిలో మేనమామ ఇంట్లో ఉంటున్న దేవనకొండ(M) జిల్లెడుబుడకల గ్రామానికి చెందిన దివాన్ జీవన పోరాటం అందరికీ ఆదర్శంగా మారుతోంది. ఉదయం ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అకౌంట్స్ లెక్చరర్గా, సాయంత్రం టీ స్టాల్లో మాస్టర్గా పనిచేస్తున్నారు. సినిమాలపై ఆసక్తితో ‘వెంకీ మామ, బడుగు జీవులు, యువచైతన్యం’ చిత్రాల్లో నటించారు. ‘రక్తచరిత్ర-3, ఉంటే ఇలాగే ఉండాలి’ చిత్రాలకు డైలాగ్ రైటర్గా పనిచేస్తున్నారు.
Similar News
News September 5, 2025
హైదరాబాద్ వల్లే తెలంగాణ నంబర్వన్: చంద్రబాబు

AP: ఎంతో ఇష్టంతో తాను HYDను అభివృద్ధి చేశానని, దాని వల్లే TG నంబర్వన్గా నిలిచిందని CM చంద్రబాబు అన్నారు. అలాగే దేశంలో ఏపీని నంబర్వన్గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న టీచర్స్ డే కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘ప్రపంచంలోనే తెలుగుజాతి నంబర్వన్గా నిలవాలి. రాబోయే 22 ఏళ్లపాటు మనమంతా దీనిపై దృష్టి సారిస్తే సాధ్యమే. విజన్ 2047 కోసం శ్రమిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు.
News September 5, 2025
2 గ్రూపుల గొడవను ఆపిన ADB ట్రాఫిక్ సీఐ

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ADB శివాజీ చౌక్ నుంచి ఠాకూర్ హోటల్కు వెళ్లే దారి మధ్యలో ఓకే మండపానికి చెందిన వ్యక్తులు రెండు గ్రూపులుగా విడిపోయి, మద్యం మత్తులో గొడవ పడ్డారు. ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పిన.. వినక పోయేసరికి బలవంతంగా వారిని చెదరగొట్టి పంపించేశారు. ఈ ఘటనను కొందరు పోలీసులు కొట్టారని దుష్ప్రచారం చేస్తున్నారని వారిపట్ల చర్యలు తప్పవని ఆయన తెలిపారు.
News September 5, 2025
కంగ్టి: గణేశ్ లడ్డూ సొంతం చేసుకున్న ముస్లింలు యువకుడు

కంగ్టి మండలం వడగావ్లో ఓ ముస్లిం యువకుడు గణేశ్ లడ్డూను వేలం పాట పాడి సొంతం చేసుకున్నాడు. శుక్రవారం గ్రామంలోని దాత గణేశ్ మండలి ఆధ్వర్యంలో నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పూజలు అందుకున్న గణేశ్ చేతిలోనే లడ్డూను వేలం వేయగా గ్రామానికి చెందిన రహీం రూ.23 వేలకు సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు సాయిబాబా ఆలయంలో లడ్డును అందజేశారు.